వనజాతర: వైభవోపేతంగా సాగుతోన్న మేడారం సమ్మక్క-సారక్క జాతర శనివారంతో ముగియనుంది. నేటి సాయంత్రం సమ్మక్క, సారక్కలు వనప్రవేశం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు సహా పలువురు కీలకనేతలు హాజరుకానున్నారు.
రాజ్యసభ అఖిలపక్ష భేటీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నేతృత్వంలో నేడు రాజ్యసభ అఖిలపక్ష భేటీ జరగనుంది.
సుప్రీం విచారణ: పటియాలా హౌస్ కోర్టు వద్ద లాయర్ల ఘర్షణలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
వామపక్షాల బస్సుయాత్ర: ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు రూ.50 వేల కోట్ల ప్యాకేజీని డిమాండ్ చేస్తూ నేటి నుంచి వామపక్ష పార్టీలు బస్సుయాత్ర ప్రారంభించనున్నాయి. తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు సీపీఎం, సీపీఐ అగ్రనేతలు ప్రకాశ్ కారత్, నారాయణ తదితరులు హాజరుకానున్నారు.
సీఎంతో సమావేశం: విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం కేఈ, శిల్పా సోదరులు ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.
విజయవాడలో దిగ్విజయ్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ విజయవాడ పర్యటన రెండో రోజుకు చేరింది.
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సెమీఫైనల్స్ లో నేడు ఇండోనేషియాతో భారత్ తలపడనుంది. సాయంత్ర 4:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదాద్రిలో నేడు పాతగట్టు లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణం జరగనుంది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment