ఆసీస్ దే పైచేయి


ఆసీస్ దే పైచేయి
సిడ్నీ:మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో ఆదివారం ఆరంభమైన చివరి టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలిరోజు ఆటలో ఆసీస్ ఆరు వికెట్లను నేలకూల్చి విండీస్ ను మరోసారి వణికించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ కు ఆదిలోనే హోప్(9) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. కాగా, మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్(85), డారెన్ బ్రేవో(33)ల జోడీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జోడీ రెండో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్ గాడిలో పడినట్లు కనిపించింది.

 అయితే బ్రేవో(33) రెండో వికెట్ గా పెవిలియన్ చేరిన అనంతరం విండీస్ వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. మార్లోన్ శామ్యూల్స్(4), బ్లాక్ వుడ్(10),హెల్డర్(1) లు స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. దీంతో తొలి రోజు ఆట  ముగిసే సమయానికి విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రామ్ దిన్(23 బ్యాటింగ్),కార్లోస్ బ్రాత్ వైట్(35 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ కు రెండు, హజిల్ వుడ్, పాటిన్సన్, ఓ కీఫ్ లకు తలో వికెట్ దక్కింది.ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Post a Comment

Powered by Blogger.