మాంసాహారం కన్నా శాఖాహారం వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని కార్నెజ్ మెలాన్ యూనివర్సిటీకి పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బహిర్గతమైంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు,సీఫుడ్స్ వినియోగం వల్ల పర్యావరణానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వీరి పరిశోధనలో తేలింది. ఆయా ఆహార పదార్థాల ఉత్పత్తికి కోసం వనరుల వినియోగం, వాటి ద్వారా ఉద్గారమయ్యే గ్రీన్ హౌస్ వాయువులు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తేలింది. మాంసంతో పోల్చితే కొన్ని రకాల ఆకు కూరలు మూడు రెట్ల గ్రీన్ హౌస్ వాయువులను వెలువరిస్తాయని ప్రొఫెసర్ పాల్ ఫిష్ బెక్ పేర్కొన్నారు. మనం నిత్యం వాడే దోసకాయ వంటి కాయగూరలు, కొన్ని ఆకు కూరల కన్నా మాంసం పర్యావరణానికి అంతగా హాని చేయదని ఆయన తెలిపారు.

Post a Comment

Powered by Blogger.